Saturday, 2 April 2011

"శక్తి" జర్క్‌తో ఇలియానా డల్: రానా ఆదుకుంటాడా...?!

భారీ బడ్జెట్‌తో నిర్మించిన జూనియర్ ఎన్టీఆర్ "శక్తి" అనుకున్న రేంజ్‌లో లేదన్న వాదనలు వినబడుతున్నాయి. ఈ చిత్రంలో నటీనటులకు మంచి మార్కులు పడ్డా... సినిమా సక్సెస్‌ను బట్టి అది మారిపోతుంటుంది.

ఇపుడు ఇలియానా పరిస్థితి కూడా అలాగే ఉన్నదట. శక్తితో టాలీవుడ్‌ను దున్నేద్దామనుకున్న ఈ భామ కాస్తంత నిరుత్సాహానికి గురైందట. దీంతో రానాతో నటిస్తున్న నేనూ - నా రాక్షసిపైనే అన్ని ఆశలు పెట్టుకున్నదట. ఈ చిత్రమైనా హిట్ సాధిస్తే మరిన్ని అవకాశాలు చేజిక్కించుకోవచ్చని అనుకుంటోందట.

ఇదిలావుంటే ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్‌లో ఓ చిత్రాన్ని అంగీకరించింది. టాలీవుడ్ మాత్రం ఇలియానాను ఐరన్ లెగ్‌గా పరిగణించి ఆమెకు ఛాన్సిచ్చేందుకు ముందుకు రావడం లేదు. కానీ తెలుగులో తను తీరిక లేకుండా ఉంటున్నానని కాకమ్మ కబుర్లు చెపుతోంది ఇలియానా.Kindle Wireless Reading Device, Wi-Fi, Graphite, 6" Display with New E Ink Pearl Technology

నరేష్‌ హీరోగా 'సీమ టపాకాయ్‌' ప్రారంభం

అల్లరి నరేశ్‌ "సీమటపాకాయ్‌"గా మారాడు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మళ్ళ విజయప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి 'సీమ టపాకాయ్‌' పేరు పెట్టారు. చిత్ర లోగో నిర్మాత ఆవిష్కరించారు. ఈసందర్భంగా జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ, ఇందులో నా పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ఈ సినిమా విజయాన్నిసాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఎల్‌బి శ్రీరామ్‌ మాట్లాడుతూ, సీమశాస్త్రి తరువాత మరో అందమైన కథను తీసుకుని నాగేశ్వరరెడ్డి అల్లరి నరేష్ కాంబినేషన్‌లో రూపొందుతోంది. కథకు తగిన టైటిల్‌ ఇది. నాగేశ్వరరెడ్డి మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

నాగినీడు మాట్లాడుతూ, వరుసగా సినిమాలు తీసే ఇలాంటి నిర్మాతలు రావడం సినిమా పరిశ్రమకు మంచి జరుగుతుంది. ఈ సినిమా టైటిల్‌కు తగ్గ విధంగా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముంది అన్నారు.

అమ్మిరాజు మాట్లాడుతూ, విజయ్‌ప్రసాద్‌గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. సీమశాస్త్రి తర్వాత అంత గొప్ప సినిమా తీసి ఇచ్చారు. ఆయనతో మరో రెండు సినిమాలు ప్లాన్‌ చేస్తున్నాను అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ, మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో వరుసగా తీస్తున్నాం. నాగేశ్వరరెడ్డి కథ చెప్పగానే తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకముంది. నరేష్‌ అభినయం కొత్తగా ఉంటుంది. అందరూ మెచ్చుకునే విధంగా ఉంటుంది. సినిమా ట్రైలర్స్‌ చాలా బాగా వచ్చాయి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు.

వందేమాతరం శ్రీనివాస్‌ మాట్లాడుతూ, సీమశాస్త్రి తర్వాత నాలుగేళ్ళకు చేస్తున్నాను. ఓ మంచి కథ నిర్మాత కోసం వెయిట్ చేశాం. అమ్మిరాజుగారు నిర్మాతను పరిచయం చేశారు. అనుకున్నట్లు చిత్రం వచ్చింది అన్నారు.

నరేష్‌ మాట్లాడుతూ,ఈ చిత్ర తొలి సినిమాకు డాక్టరేట్‌ 2వ సినిమాకు ఎం.ఎల్‌.ఎ. అయ్యారు. మళ్ళీ నాతో సినిమా తీస్తే మంచి అవుతారు. ఈ బేనర్‌ సొంత బేనర్‌లాంటిది. ఈ సినిమాలో రిచ్‌ అయినా బట్టలు మాత్రం పేదవారి బట్టల్లాగా ఉంటాయి. పేరడీ సాంగ్‌ బాగా వచ్చింది. చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది అన్నారు.