సూపర్ స్టార్ మహేష్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'ఆగడు'. మహేష్ తో 'దూకుడు', '1-నేనొక్కడినే' సినిమాలను నిర్మించిన 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ షెడ్యూల్ ను ఈ నెలాఖరున ముగించి తదుపరి షెడ్యూల్ ను ఏప్రిల్ లో గుజరాత్ లో చిత్రీకరించాలనే ఆలోచనలో ఉన్నారట. అంటే మహేష్ నెక్ట్స్ గుజరాత్ కి వెళ్లనున్నాడన్నమాట. 2014 ద్వితీయార్థంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
No comments:
Post a Comment