Thursday, 24 March 2011

గణేష్ నిర్మాతగా ఎన్‌టి.ఆర్- శ్రీనువైట్ల చిత్రం

పవన్‌కళ్యాణ్‌తో 'తీన్‌మార్‌' చిత్రాన్ని నిర్మిస్తున్న గణేష్‌బాబు ఆ చిత్రం అనంతరం ఎన్‌.టి.ఆర్‌., శ్రీనువైట్ల కాంబినేషన్‌లో భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరి కాంబినేషన్‌కు పలువురు అగ్రనిర్మాతలు ముందుకువచ్చినా....ఆ అవకాశం గణేష్‌బాబుకే దక్కింది. పరమేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఎవరి వరిస్తుందో నన్న ఇంట్రస్ట్‌ నెలకొంది.

ఇప్పటికే ఎన్‌.టి.ఆర్‌. శక్తి తర్వాత కె.ఎస్‌.రామావు నిర్మాతగా బోయపాటి శ్రీనుదర్శకత్వంలో చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్‌వర్క్‌ పూర్తయి మ్యూజిక్‌ సిట్టింగ్‌ జరుగుతున్న ఈ చిత్రం తర్వాతే శ్రీనువైట్ల చిత్రం ఉంటుంది. తాజా చిత్రంలో ముగ్గురు హీరోయిన్లను ఎంపికచేయనున్నారు.

No comments:

Post a Comment